Friday, April 26, 2024
- Advertisement -

ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్ర‌మాదం…ఇద్ద‌రు మృతి

- Advertisement -

ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మ్యాక్సీ ట్రక్ వాహనం టైరు పగలడంతో ఇద్దరు మృతి చెందగా, 9మంది గాయాలపాలయ్యారు. బుధవారం ఉదయం కూలీలను మ్యాక్సీ ట్రక్‌లో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది వివ‌రాల్లోకి వెల్తే….ఓఆర్‌ఆర్‌పై మ్యాక్సీ ట్రక్‌ వాహనం రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా టైర్‌ పేలిపోయింది. దీంతో ఆ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న కూలీలు రోడ్డుపై ఎగిరిపడ్డారు. ఒక మహిళ ఘటన స్థలంలోనే మృతిచెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో మొత్తం 11 మంది ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన దంపతులు, గాయపడ్డ క్షతగాత్రులు అంతా దినసరి కూలీలు కావడం విశేషం. పొట్టకూటి కోసం వెళ్తూ ప్రమాదం జరగడంతో వారంతా బోరున విలపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -