కేరళలో దారుణం జరిగింది. 9 ఏళ్ల బాలుడిపై ఓ మహిళ అత్యాచారం చేసింది. ఒక్కసారి కాదు.. గత కొన్ని నెలలుగా ఈ తంతు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కేరళలోని మలప్పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడు కొన్ని రోజులుగా ఎవరితో మాట్లాడకుండా, డిప్రెషన్తో ఉండటంతో డాక్టర్ను సంప్రదించారు అతని తల్లిదండ్రులు. బాలుడితో కాసేపు మాట్లాడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ తనతో ఏమేం చేపిస్తుందో మొత్తం చెప్పేయడంతో.. ఆ డాక్టర్ ఈ విషయాన్ని అతని తల్లిదండ్రులకు చెరవేశాడు.
దీనిపై పోలీసులను ఆశ్రయించారు అతని తల్లిదండ్రులు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ బాలుడి తరపు బంధువేనని.. అతడి ఇంటికి దగ్గరలోనే నివసిస్తుందని పోలీసులు గుర్తించారు. గత కొన్ని నెలలుగా ఆమె లైంగిక కోరికలను తీర్చుకోవడానికి బాలుడిని వాడుకుంటుందన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.