Friday, April 19, 2024
- Advertisement -

తొమ్మిది నెల‌ల చిన్నారిపై రేప్‌…..ప్రాణాలు కోల్పోయిన బాలిక‌

- Advertisement -

వరంగల్ అర్బన్ జిల్లాలో మ‌రో మాన‌వ మృగం రెచ్చిపోయింది. 9 నెలల ఓ చిన్నారిపై ఓయువ‌కుడు అత్యాచారం చేయ‌డంతో తీవ్ర ర‌క్త స్రావం జ‌రిగి చిన్నారి బాలిక మ‌ర‌ణించింది. ఈ సంఘ‌ట‌న తెలంగాణాలోని హన్మకొండలో ఈ దారుణం చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెల్తే…జగన్-రచనల కుమార్తె అయిన చిన్నారి మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి దాబాపై నిద్రిస్తుండగా..పక్క కాలనీలో నివాసం ఉంటే ప్రవీణ్ ఉదయాన్నే పాప నిద్రపోతుండగా ఆమెను ఎత్తుకెళ్లాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా చిన్నారి స్పృహ తప్పడంతో చనిపోయిందని అనుకుని అక్కడి నుంచి పరారు అయ్యాడు.

బాలిక కనిపించకపోవడంతో ఈ ప్రాంతమంతా గాలించిన కుటుంబ సభ్యులు, బంధువులు బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు. పోస్కో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. చిన్నారి మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -