గత కొన్ని రోజులుగా అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్కు చెందిన కొన్ని వెంట్రుకలు, రక్తపు మరకల టెలిగ్రామ్ వేలం వేశారు. వేలం పాటలో వాటిని 81 వేల డాలర్ల (60 లక్షల రూపాయలు)కు సొంతం చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఆర్ఆర్ ఆక్షన్ ఆఫ్ బోస్టన్ అనే సంస్థ ఈ వేలం పాటను నిర్వహించింది.
జాన్ లిక్స్ బూత్ చేతిలో కాల్చిన చంపబడిన తర్వాత లింకన్కు పోస్ట్మార్టమ్ నిర్వహిస్తున్నపుడు ఐదు సెంటీమీటర్ల పొడవుతో కొన్ని వెంట్రుకలు కత్తిరించి భద్రపరిచారు వైద్యులు. అనంతరం వాటిని 1865, ఏప్రిల్ ఓ టెలిగ్రామ్ ద్వారా లింకన్ సహాయకుడికి పంపారు. ఆ తర్వాత వెంట్రుకలు, టెలిగ్రామ్ మాజీ అధ్యక్షుడి కుటుంబసభ్యుల వద్ద భద్రంగా ఉండింది.
వీటిని 1999లో మొదటిసారి వేలం వేశారు. ఈ టెలిగ్రామ్కు ఘనమైన చరిత్ర ఉంది. లింకన్కు ఆయన సెక్రెటరీ ఎడ్విన్ స్టాన్టన్కు మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయని, ఆ కారణంగానే ఎడ్విన్, లింకన్ చంపించటానికి చూశాడన్న చరిత్రకారుల వాదనను ఈ టెలిగ్రామ్ తప్పని నిరూపిస్తోంది.