గతంలో న ప్రతిపక్ష నేత ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. ఈ కేసును ఎన్ ఐఏ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం జైల్లో ఉన్న శ్రీనివాస్ ను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని నిందితుడు అన్న జనుపల్లి సుబ్బరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులు శ్రీనివాసరావును నెల రోజులుగా వేధిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉందని జైలర్, వార్డెన్ వేధిస్తున్నారని, పదే పదే ఆత్మహత్య చేసుకోవాలని సూచిస్తూ, ఆదిశగా ఆతనిని ప్రేరేపిస్తున్నారని నిందితుడి అన్న ,అతని తరుపు లాయర్ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్లనే కేసును పశ్చిమబెంగాల్కు లేదా కేరళ రాష్ట్రానికి బదిలీచేసి అక్కడి కోర్టులో విచారణ జరిపించాలని తన ఫిర్యాదులో కోరారు.