Friday, March 29, 2024
- Advertisement -

ఇక పై రైలు ప్రయాణికుల కష్టాలు తొలగినట్లే..?

- Advertisement -

కరోనా వల్ల స్తంభించిపోయింది రైళ్లు తిరిగి పట్టాలెక్కుతున్నాయి.. ఇప్పటివరకు కొద్ది పాటి రైళ్లతో సరిపెట్టిన కేంద్రం ఇప్పుడు మరికొన్ని రైళ్లను ప్రజలకు అందిస్తుంది. అన్‌లాక్-4లో భాగంగా ప్రకటించిన 80 ప్రత్యేక రైళ్లు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి.

రైలు ప్రయాణం చేసేవారు కేంద్రం సూచించిన కరోనా నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని ఈస్ట్‌కోస్ట్ వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠీ పేర్కొన్నారు. టికెట్లు కన్ఫామ్ అయిన వారు మాత్రమే స్టేషన్‌కు రావాలని, రైలు ఎక్కేటప్పుడు ప్రయాణికులు విధిగా మాస్క్/ఫేస్ షీల్డ్ ధరించాలని సూచించారు.

స్టేషన్‌లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు కాబట్టి నిర్ణీత సమయం కంటే ముందే స్టేషన్‌కు రావాల్సి ఉంటుందన్నారు. కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. స్టేషన్‌లోనూ, రైలులోనూ భౌతిక దూరం తప్పనిసరని స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల హెల్త్ ప్రొటోకాల్‌ను అనుసరించాలని సూచించారు. అలాగే, ప్రయాణికులందరూ ఎవరికి వారే తమ సొంత దుప్పట్లను వెంట తెచ్చుకోవాలని త్రిపాఠీ కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -