- Advertisement -
హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రోస్టేష్ లో విషాద కర ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ పైకప్పు పెచ్చులూడి ఓ మహిళపై పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. వర్షం పుడుతుండటంతో తడవకుండా ఉండేందుకు మెట్రో స్టేషన్ కిందరకు వచ్చింది. అదే సమయంలో స్టేషన్ రెయిలింగ్ ఒక్కసారి ఊడి ఆమెపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ చనిపోయింది. ఈ ఘటనతో మెట్రో స్టేషన్ నిర్మాణాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి.మృతురాలిని కేపీహెచ్బీకి చెందిన కంతాల మౌనికగా గుర్తించారు.. ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. మౌనిక టీసీఎస్లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్సార్నగర్ పోలీసులు.. విచారణ చేపట్టారు