Wednesday, April 24, 2024
- Advertisement -

రోడ్డు ప్ర‌మాదంలో త‌మ్మినేని సీతారం అనుచ‌ర‌లు దుర్మ‌ర‌ణం….

- Advertisement -

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.అంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్‌గా తమ అభిమాన నేత ఉన్నత పదవిని స్వీకరిస్తున్నారన్న ఆనందంలో ఆయనకు అభినందనలు చెప్పేందుకు బయుదేరిన వారికి అదే ఆఖరి ప్రయాణం అయింది. రోడ్డు ప్ర‌మాదంలో వారిని మృత్యేవు క‌బ‌ళించింది.

స్పీకర్‌గా శ్రీకాకుళం జల్లా ఆమదావలస నియోజకవర్గం ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన ఈరోజు అసెంబ్లీలో స్పీకర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. వీళ్లంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తుని సమీపంలో గురువారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఢీకొట్టింట్ట‌డంతో … ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరుకి చెందిన పప్పల నారాయణ మూర్తి, బడాన లక్ష్మి నాయుడు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను తుని ఆసుపత్రికి తరలించారు. మద్ద‌తు దారులు మ‌ర‌ణించ‌డంతో త‌మ్మినేని కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -