- Advertisement -
ఏపీకీ ప్రత్యేకహోదా అంశంపై టీడీపీ ఎంపీ జేసీ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకహోదా రాదని ప్రత్యేకప్యాకేజీ మాత్రమే వస్తుందని కుండబద్దలు కొట్టారు. పనిలో పనిగా వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామంటూ వైసీపీ డ్రామాలు ఆడుతోందని, ఒకవేళ వారు రాజీనామాలు చేసినా, అవి ఆమోదం పొందే లోపే ఎన్నికల కోడ్ వస్తుందని అన్నారు.
డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై జగన్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఈరోజే వైసీపీ తమ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చిన రాజప్ప అన్నారు.