పరారీలో మాజీ స్పీకర్ కొడుకు, కూతురు
కే ట్యాక్స్’పై ఐదు కేసులు
వారికోసం పోలీసుల గాలింపు చర్యలు
మాజీ స్పీకర్ కొడెల కుటుంబం చేట్టూ ఉచ్చు బిగిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కే ట్యాక్స్ పేరుతో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో మాజీ స్పీకర్ కడెల కూతరు, కొడుకు వసూలు చేసిన సంగతి తెలిసిందే. కేట్యాక్స్ బాధితులు ఒక్కక్కరే బయటకు వస్తున్నారు. ఇప్పటికే వీరిమీద ఐదు కేసులు నమోదయ్యాయి.
వాటిల్లో రెండు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి. భూ కబ్జా, నకిలీ పత్రాల తయారీ, బెదిరింపులు, కులదూషణలు చేసినట్టు ఆరోపణలు రావడంతో, వీరిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టిన పోలీసులు విచారణ చేపట్టారు. వారిపై వచ్చిన ఆరోపనలకు ప్రాథమి సక్ష్యాలు ఉండటంతో పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో, విషయం తెలిసి శివరామ్, విజయలక్ష్మిలు నరసరావు పేటను వీడినట్లు సమాచారం.
కోడెల ఆయన కుమారుడు కోడెల శివరామ్, విజయలక్ష్మి ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. వారిని విచారించేందుకు పోలీసులు ఫోన్లు చేసినా స్పందన లేనట్లు సమాచారం. బాధితుల తాకిడితో వారిద్దరూ ఊరు విడిచి వెళ్లినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. పరారీలో ఉన్న వారికోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.సాధ్యమైనంత త్వరలో వారికి నోటీసులు ఇచ్చి విచారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.