ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఇప్పటికే ఫెన్షన్ పెంపు ఫైలు మీద సంతకం చేసిన జగన్ ఆతర్వాత ఆశా వర్కర్ల జీతాలను రూ.3000 నుంచి 10,000 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుగా తాజాగా గ్రామాల్లో వాలంటీర్ల నియామకానికి పచ్చ జెండా ఊపారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ పని మొదలు పెట్టారు. గ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. దీని ద్వారా 4 లక్షల ఉద్యోగాలు రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ap.gov.in వైబ్ సైట్ లో జూలై నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 4,33,126 వాలంటీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 15 ముందే ఫలితాలు విడుదల చేయనున్నారు.
అర్హత : పదవ తరగతి, ఇంటర్మీడియట్..
వయస్సు : 18 నుండి 39 సంవత్సరాల లోపు
కావాల్సిన పత్రాలు
SSC సర్టిఫికెట్