పాక్ పై మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్మీ చీఫ్ రావత్. ఆయన మాటలు చూస్తె మరో సారి బాలాకోట్ పై సర్జికల్ దాడులు చేసేందుకు సిద్దంగా ఉన్నామని పాక్ పాలకులను హెచ్చరించారు. పుల్వామా దాడి తర్వాత భారత దళాలు జరిపిన వైమానికి దాడుల్లో తుడిచిపెట్టుకుపోయిన బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరం మళ్లీ ప్రారంభం అయ్యిందని రావత్ వెల్లడించారు. అక్కడ 500 మంది ఉగ్రవాదులు ఉన్నారన్నారు. వారు భారత్ లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
బాలాకోట్ స్థావరంపై మరోసారి సర్జికల్ దాడి చేసినా ఆశ్చర్యం లేదని రావత్ తెలిపారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని, బాలాకోట్ దాడి కన్నా మరింత బలమైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. చెన్నైలో ని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన ఓకార్యక్రమంలో పాల్గొన్నారు.కశ్మీర్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. వ్యాలీలో ఉగ్రవాదులు అల్లర్లు సృష్టించాలనుకుంటున్నారన్నారు.కశ్మీర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిన ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేస్తామన్నారు.