Saturday, April 20, 2024
- Advertisement -

కరోనా బాధితుల కాపాడుదం అని వెళ్లిన డాక్టర్లపై దాడి..!

- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన మర్కజ్ ప్రార్దనలకు వెళ్లివచ్చిన వారికే ఎక్కువగా కరోనా సోకింది. దాంతో ఆ మత ప్రార్దనలకు సమావేశాలకు హాజరయిన వారు ఎవరన్న దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా దర్యాప్తు చేస్తున్నాయి. వారిని గుర్తించి వారికి చికిత్స అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఈ కరోనా అనుమానితుల ఆగడాలు మాత్రం తాజాగా శృతిమించాయి. తాజాగా ఢిల్లీలోని ఆర్పీఎఫ్ బ్యారెక్ తోపాటు డిజిల్ షెడ్ ట్రైనింగ్ స్కూల్లో ఈ తబ్లిగీ జమాత్ కార్యకర్తలను క్వారంటైన్ లో ఉంచారు. అయితే వీరు వైద్యం చేసేందుకు వచ్చే డాక్టర్లపై ఉమ్మివేస్తూ వికృత చేష్టలకు దిగుతున్నారని సీపీఆర్వో దీపక్ కుమార్ తెలియజేశారు. క్వారంటైన్ లో ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ వైద్యులపై ఉమ్ముతూ నానా బీభత్సం సృష్టిస్తున్నారని.. గొడవ కూడా చేస్తున్నారని తెలిపారు.

ఇక మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గల తట్ పట్టిభాకల్ ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన కరోనా పేషెంట్ అనుమానితుడిని హాస్పిటల్ కి తీసుకెళ్లేందుకు వచ్చిన ఇద్దరు మహిళా డాక్టర్లు వైద్య సిబ్బందిపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. దాంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై వైద్యాధికారులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కరోనా రోగులను కాపాడడానికి శ్రమిస్తున్న డాక్టర్ల పై దాడి చేయడం సరికాదన్నారు. వైద్య సిబ్బందికి రక్షణ కల్పిస్తామని డీజీపీ తెలిపారు. రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -