తమ శారీరక సుఖాలకోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు వెనుకాడటంలేదు మానవ మృగాలు. మేజర్, మైనర్ అనే తేడాలేకుండా చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు జరగుతున్న సంఘటనలు ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం. కామాంధులు చేసె నీచ పనులను చూసిన వారిని కూడా వదిలిపెట్టకుండా చంపేస్తున్న సంఘటనలు గతంలో అనేకం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. మైనర్ బాలికపై కామాంధుడు చేసిన నీచమైన పనిని కళ్లప్పగించి చూడటమే ఆ పసికందుకు మరణశాసనమైంది. ఎక్కడ చెబుతుందోనని నాలుగేళ్ల పసికందును పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
వివరాల్లోకి వెల్తే….ఈసంఘటన బెంగులూరులోని తాలూకాలోని హల్కూరు గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకాలోని అరళేరి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని హుల్కూరు గ్రామానికి చెందిన మునిరాజుకు వివాహమైంది. ఇతనికి 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం భార్య 7 నెలల గర్భిణి. ఇంటి పక్కనే నివాసం ఉంటున్న మైనర్ బాలికపై కన్ను వేశాడు.
రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడే పడుకొని ఉన్న నాలుగేళ్ల వయసున్న బాలిక ఈ ఉదంతాన్ని కళ్లారా చూసింది. ఈ విషయం ఎక్కడ బయట పెడుతుందోనని అక్కడి నుంచి తీసుకెళ్లి చంపి మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేశాడు. చిన్నారి వేద కనిపించక పోవడంతో పోషకులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మునిరాజుపై అనుమానంతో పోలీసులు పోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో…గాలింపు చేపట్టి శనివారం నిందితుడు మునిరాజును అరెస్ట్ చేశారు.