చద్దన్నాన్ని చాలా మంది చులకనగా చూస్తారు.ఇది పట్టణాలకే కాదు..పల్లెలకు పాకింది.ఇప్పటికీ చాలా పల్లెల్లో పొద్దున్నే సద్దెన్నం తింటారు.అందుకేవాల్లు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా వంద సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు.కాని ఇప్పుడు వస్తున్న ఆహారపు అలవాట్లవల్ల కనీసం 60 సంవత్సరాలు కూడా బ్రతకడంలేదు.
అదే టౌన్ లో అయితే చాలా వరకు రాత్రి అన్నం మిగిలితే morning పారేయడమో లేదా పనివాళ్ళకి ఇవ్వడమో చేస్తారు.
కాని చద్ది అన్నం తినడం వల్ల ఉన్న ఉపయేగాలు ఏదానికి లేవని కొంతమంది పరిశోధకులు దీని గురించి కొన్ని ఆశక్తికర విషయాలను బయటపెట్టారు. దీని వల్ల శరీరానికి ఎన్నో ఉపయేగాలు ఉంటాయన్నారు.
రాత్రిపూట మిగిలిపోయిన అన్నం మార్నింగ్ తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిదట. పెద్దల కాలంలో మన తాతలు అవ్వలు సద్దన్నం లో మజ్జిగ కలుపుకొని ఉల్లిపాయ మరియు మిరపయాక నంచుకుని తినేవారు .. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు .. 100 ఎడ్లు బ్రతికేవాళ్లు.
అసలు విసయానికివస్తే అన్నంను రాత్రి అంతా ఉంచడంవల్ల అందులో కొన్ని రకాల మార్పులు చోటుచేసుకుంటాయి.. 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న Iron 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పొటాషియం మరియు Calcium లు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయి.
చద్దన్నం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో కింద తెలుసుకుందాం
1. ఎక్కువ సమయం ఉల్లాసంగా ఉండాలంటే మార్నింగ్ సద్దన్నం తినాలి
2. శరీరంలో రోగనిరోదక శక్తి ని పెంచుతుంది.
3. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చద్దన్నంలో పెరుగు, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.
4. పలు చర్మ వ్యాదుల నుండి కాపాడుతుంది.
5. మలబద్దకం, నీరసం తగ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది.
6. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.
చూశారుగా చద్దిఅన్నంలో పెరుగు కలుపు కొని తింటే ఎన్ని ప్రయేజానాలో.ఇక నుంచి మీరు కూడా ఉదయాన్నే చద్దన్నం తినండి.రోజంతా ఉల్లాసంగా,ఉత్సాహంగ ఉంటారు.