Thursday, April 25, 2024
- Advertisement -

ఘోరమైన చెత్త రికార్డు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం..?

- Advertisement -

ఎవరిపాలన ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజు రోజు కి అప్పుల ఊబిలో కూరుకుపోతుందన్నది మాత్రం నిజం.. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగినా, జగన్ హయాంలో అభివృద్ధి జరిగిన ఈ అప్పుల బెడదను మాత్రం ఎవరు తీర్చలేకేపోవుతున్నారని వాదన ఇప్పుడు ప్రజల్లో కనిపిస్తుంది.. ఒకరిపై ఒకరు ఈ అప్పుల నిందను వేసుకుని తపిపంచుకుంటున్నారే తప్పా దీన్ని ఎలా తీర్చాలి, ఎలా చేయకూడదు అన్నదానిపై ఎవరు ఆలోచించట్లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు..

ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పుగా తీసుకొచ్చినవేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తేల్చింది. ఆర్థిక సంవత్సరం సగం కూడా పూర్తికాకముందే ఏడాది కాలానికి అంచనా వేసిన అప్పు మొత్తాన్ని తీసుకుంది. ప్రభుత్వం గత ఐదు నెలల్లో వివిధ రూపాల్లో రూ. 84,617.23 కోట్లు సమీకరించగా, అందులో రూ. 47,130.90 కోట్ల రుణాలు ఉన్నాయి. అంటే మొత్తం సమీకరించిన మొత్తంలో 55.7 శాతం అప్పే.

కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, పన్నులు, పన్నేతర ఆదాయాలు తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. సెక్యూరిటీల వేలం, ఇతర అప్పుల రూపంలో ఈ ఏడాది రూ. 48,295.58 కోట్లు తీసుకోనున్నట్టు బడ్జెట్ అంచనాల సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆగస్టు నాటికే ఆ మొత్తాన్ని తీసేసుకున్నట్టు కాగ్ నివేదిక తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -