- Advertisement -
ఈ మధ్యన ఎక్కువగా రాజకీయానాయకులు గుండె పోటుతో మృతి చెందుతున్న సంఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. గుండె పోటుతో తమిళనాడు ఆన్నాడీఎమ్కే ఎమ్మెల్యే మృతి చెందిన కొద్ది రోజులకే కర్నాకట మంత్రి సీఎస్ శివల్లి(58) గుండెపోటుతో మృతిచెందారు. తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత మూడు రోజులుగా ధార్వాడ్లో భవనం కూలిన ప్రాంతంలో చేపట్టిన సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. బిల్డింగ్ కూలిన ఘటనలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు.కొంతమంది ప్రజలతో మాట్లాడుతుండగా అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయన్ని హుబ్బల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం శివల్లి గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు.