Tuesday, April 16, 2024
- Advertisement -

ప‌రారీలో టీడీపీ ఎంపీ ముర‌ళీ మోహ‌న్‌…?

- Advertisement -

లోక్ స‌భ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో తెలంగాణా పోలీసులు ముమ్మ‌రంగ త‌నిఖీలు చేప‌ట్టారు. న‌గ‌రంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో పోలీసుల త‌నిఖీల్లో రాజమండ్రి టీడీపీఎంపీ.. సీనియర్ సినీ నటుడు మురళీమోహన్ కు సంబంధించిన న‌గ‌దు రూ.2 కోట్ల‌ను సైబ‌రాబాద్ పోలీసులు ప‌ట్టుకున్నారు. దీంతో అత‌నిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

మాదాపూర్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో పోలీసుల‌క‌ళ్లుగ‌ప్పి హైటెక్ సిటీ రైల్వే స్టేష‌న్ నుంచి త‌ర‌లిస్తున్న రూ.2 కోట్లును సీజ్ చేసిన‌ట్లు సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు బృందాలకు శ్రీహరి.. పండరి అనే వ్యక్తులు హైటెక్ సిటీలో అనుమానాస్పదంగా కనిపించారని.. వారి వద్ద ఉన్న బ్యాగుల్ని తనిఖీ చేయగా రూ.2 కోట్ల మొత్తం దొరికినట్లుగా పేర్కొన్నారు.

ప‌ట్టుబ‌డిన వారు జ‌య‌భేరి సంస్థ‌లో ప‌నిచేసె ఉద్యోగులు జగన్మోహన్.. ధర్మరాజులు వారికి డబ్బులు ఇచ్చినట్లుగా నిందితులు పేర్కొన్నారని.. ఈ డబ్బు కోసం యలమంచిలి మురళీకృష్ణ.. మురళీమోహన్ లు రాజమండ్రిలో ఎదురుచూస్తున్నట్లుగా వారు చెప్పారన్నారు. దీంతో రాజ‌మండ్రి టీడీపీ ఎంపీ రాజ‌మోహన్‌రెడ్డిది అని తేలింద‌ని, ఆయ‌న‌తోపాటు, మ‌రో ఐదుగురిపై కేసు న‌మోదు చేసిన‌ట్టు సీపీ స‌జ్జ‌నార్ తెలిపారు. రాజ‌మండ్రి టీడీపీ ఎంపీ రాజ‌మోహన్‌రెడ్డిది అని తేలింద‌ని, ఆయ‌న‌తోపాటు, మ‌రో ఐదుగురిపై కేసు న‌మోదు చేసిన‌ట్టు సీపీ స‌జ్జ‌నార్ తెలిపారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -