Saturday, April 20, 2024
- Advertisement -

లగడపాటికి చిక్కులు.. జగన్ వదులుతాడా?

- Advertisement -

మొన్నటి తెలంగాణ ఎన్నికల వేళ.. నిన్నటి ఆంధ్రా ఎన్నికల వేళ..‘లగడపాటి’ అదే ‘పచ్చ’పాతం చూపారు. చంద్రబాబు ప్రోద్బలంతో టీడీపీకి ఫేవర్ గా సర్వేలు బయటపెట్టించారు. తెలంగాణలో బెడిసికొట్టింది. ఏపీలో ఈసారి ఖచ్చితంగా బాబు గెలుస్తాడని లగడపాటి చెప్పారు. ఇప్పుడూ దిమ్మదిరిగి బొమ్మ కనపడింది.

చంద్రబాబుకు ఫేవర్ గా లగడపాటి సర్వేలు బయటపెట్టడంతో వైసీపీ అభిమానులు హర్ట్ అవ్వగా.. టీడీపీ నేతలు మాత్రం పండుగ చేసుకున్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియా బాబు గెలుస్తున్నాడని చేసిన రాద్ధాంతం అంతా ఇంతాకాదు.. కానీ చివరకు బూమరాంగ్ అయ్యింది. లగడపాటి నమ్మి కోట్లు బెట్టింగ్ కాసిన వాళ్లంతా పూర్తిగా మునిగిపోయారు. ఇళ్లు వాకిలి అమ్ముకున్నారు.

తాజాగా లగడపాటి సర్వేపై కడుపుమండిన ఓ లాయర్ మురళికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. తప్పుడు సర్వేల వల్ల అనేకమంది నష్టపోయారని.. లగడపాటి తప్పుడు సర్వేల వెనుక ఎవరున్నారో తేల్చాలని పోలీసులను కోరారు.

మురళీ కృష్ణ ఫిర్యాదుతో తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే సర్వేలు వ్యక్తిగత ఇష్టాలు.. నమ్మొచ్చా నమ్మకూడదు. దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దీనిపై పోలీసులు లీగల్ ఓపినియన్ తీసుకుంటున్నారు. మోసం చేశారనే కోణంలో కేసునమోదుపై ఆలోచిస్తున్నారు. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం.. లగడపాటిపై ఫిర్యాదు రావడంతో ఆయనకు షాకిచ్చేలా ప్రతీకార చర్యలు ఖచ్చితంగా ఉండేటట్టే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -