టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆఫీసులపై మరో సారి సీబీఐ దాడులు జరగడం రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బెంగులూరునుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఉదయంనుంచి ఆయన ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు.హైదరాబాద్ లోని సుజనాకు చెందిన మూడు నివాసాలకు చేరుకున్న సీబీఐ బృందాలు అణువణువను గాలిస్తున్నాయి. సుజనా చౌదరి బ్యాంకులకు దాదాపు రూ.6,000 కోట్లు ఎగ్గొట్టారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ దాడులు నిర్వహించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
2018-19 మధ్యకాలంలో సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు తెలంగాణతో పాటు ఏపీలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో పలుమార్లు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సుజన ఆఫీసు, కార్యాలయాల్లో పలు కీలకపత్రాలు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగ మరో సారి సీబీఐ అధికారులు దాడలు చేయడంతో కలకలం రేపుతోంది.