- Advertisement -
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించిన అధికారులపై సీఈసీ కన్నెర్ర జేసింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారులపై తక్షణ చర్యలకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. నూజివీడు, సూళ్లూరుపేట, కోవూరు ఆర్వోలపై చార్జెస్ ఫ్రేమ్కు ఆదేశించింది. అలాగే ఏఆర్వోలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం… నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సస్పెండ్ చేసింది.