- Advertisement -
ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో, ఎగ్జిట్పోల్స్, సర్వేల అంచనాలకు సైతం అందకుండా ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 151 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక జగన్ గెలపు లాంఛనమే. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు సాయంత్రం తన పదవికి రాజీనామా చేయనున్నారు.
టీడీపీ ఘోర ఓటమి ఖాయం కావడంతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీనామా చేయబోతున్నారు. నేటి (గురువారం) సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబు గవర్నర్కు పంపించనున్నారు