- Advertisement -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుకుమా జిల్లాలో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. తొమ్మిది మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రత్యేక డీజీపీ (యాంటీ-నక్సల్స్ ఆపరేషన్స్) డీఎం అవస్థీ తెలియజేశారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.