Thursday, April 25, 2024
- Advertisement -

ఛ‌త్తీస్ గ‌డ్‌లో ఎన్‌కౌంట‌ర్‌…న‌లుగ‌రు జ‌వాన్లు మృతి …

- Advertisement -

ఛ‌త్తీస్ గ‌డ్ మ‌రో సారి కాల్పుల మోద‌తో ద‌ద్ద‌రిల్లింది. కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంట‌ర్ లో జ‌వాన్ల‌కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య జ‌రిగిన ఎదురు కాల్పుల్లో న‌లుగురు జ‌వాన్లు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు. గాయపడిన జవాన్లను హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ ప్రాంతంలో గురువారం (ఏప్రిల్ 4) ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపైకి మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. దీంతో భ‌ద్ర‌తా ధ‌ళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభంచాయి. ఎదురు కాల్పుల్లో ఏఎస్సై సహా ముగ్గురు జవాన్లు మృతిచెందారు.ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -