Saturday, April 20, 2024
- Advertisement -

పవన్, నేను అందుకే ఓడిపోయాం: చిరు సంచలనం

- Advertisement -

ప్రజారాజ్యం పెట్టి రాజకీయాల్లో ఓడిపోయారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు తన తమ్ముడు జనసేన స్థాపించి కూడా ప్రజారాజ్యం కంటే కూడా దారుణ ఓటమిని చవిచూశారు. తమ్ముడి ఓటమిపై ఇంతవరకూ స్పందించని మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఈ విషయంలో కీలక కామెంట్స్ చేసినట్టు తెలిసింది.

సైరా ప్రమోషన్ లో భాగంగా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలపై చిరంజీవి స్పందించారు. సౌమ్యంగా ఉండేవారు రాజకీయాల్లో రాణించని.. సినిమాల్లో సుప్రీం హీరో అయిన తాను రాజకీయాల్లో మాత్రం గెలవలేకపోయానని చెప్పుకొచ్చాడు. రాజకీయాలంటే టీ తాగినంత సులభం కాదన్నారు. ప్రస్తుతం రాజకీయాలను కులం, డబ్బు శాసిస్తున్నాయని.. ఎదురుదెబ్బలు తింటేనే రాజకీయాల్లోకి రావాలన్నారు.

తాను 2009లో తమ సొంత ప్రాంతం పాలకొల్లులో పోటీచేసి ఓడిపోయానని.. పవన్ సైతం గాజువాక, భీమవరంలో ఓడిపోయారని.. సొంత జిల్లాలో తమ ఓటమికి కేవలం డబ్బు ప్రభావమే అని చిరంజీవి హాట్ కామెంట్ చేశారు. ప్రత్యర్థి పార్టీల డబ్బు ప్రభావంతోనే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడని తెలిపారు.

జనసేన గురించి.. పవన్ గురించి ఇంతవరకూ చిరంజీవి స్పందించలేదు. తాజాగా పవన్ ఓటమికి డబ్బు,కుల ప్రభావం కారణమని చిరంజీవి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ కూడా డబ్బు ఖర్చు చేయలేకే తాము నీట్ పాలిటిక్స్ చేసి ఓడిపోయామని తెలిపారు. ఇప్పుడు చిరంజీవి కూడా అదే మాట అనడం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -