సినీ నటుడు, మాజీ ఎంపీ శివప్రసాద్ శాశ్వతంగా నిద్రలోకి వెల్లిపోయారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.కొద్దిరోజులుగా అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్లో చికిత్సపొందుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కొద్దిరోజుల క్రితం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
అయితే రోజా హీరోయిన్ గా రాణించడానికి శివప్రసాదే ప్రధానం కారణం.చిత్తూరు జిల్లాకు చెందిన శివకుమార్ నాటకరంగం నుంచి వెండితెరకు వెళ్లారు. తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించారు. ఆ తర్వాత తనలోని ప్రతిభకు పదును పెట్టి నాలుగు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు.
మెగాఫోన్ పట్టిన మొదటి సినిమాలో రోజాను హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేశారు. అంతకు ముందు శోభన్ బాబు హీరోగా వచ్చిన సర్పయాగం సినిమాలో రోజా నటించినా.. హీరోయిన్గా పరిచయం అయింది మాత్రం ప్రేమతపస్సుతోనే. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పక్కన హీరోయిన్గా నటించింది. నారమల్లి శివప్రసాద్, ఆర్కే రోజా ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. శివప్రసాద్ టీడీపీలోనె కొనసాగుతుండగా రోజా మాత్రం మొదట టీడీపీలో ఉన్నా తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వైఎస్ మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డికి అండగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు.