- Advertisement -
సీఎం జగన్, ఆపార్టీ మహిళానేతలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారి అరెస్ట్ పరంపర కొనసాగుతోంది. తాజాగా జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిత్తూరు జిల్లా టీడీపీకి చెందిన జనార్దన్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలానికి చెందిన జనార్దన్ రాజును శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.ఈ నెల 26న తలకోనలో ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలపై జనార్దన్ అనుచిత వ్యాఖ్యాలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో, ఆయనను సీఐ సురేందర్ రెడ్డి అరెస్ట్ చేశారు.