Friday, April 26, 2024
- Advertisement -

హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్..

- Advertisement -

మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దాంతో పాటు తెలంగాణాలో కూడా హుజూర్ నగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. ఉప ఎన్నిక అబ్యర్ధి ఎవరనే దానిపై కాంగ్రెస్ పార్టీలో కుమ్మలాటలు జరుగుతున్నాయి. ఇక టీఆర్ ఎస్ మాత్రం తమ అభ్యర్థిని ప్రకటించింది.

హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక టీఆర్ ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును సిఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.హుజూర్ నగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ శనివారం మాట్లాడారు. తిరిగి సైదిరెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టాలని సిఎం నిర్ణయించారు. వచ్చే నెల 21న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 24న కౌంటింగ్ జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -