Saturday, April 20, 2024
- Advertisement -

ప్ర‌త్యేక హోదా ఉద్య‌మ‌కారుల‌కు భారీ ఊర‌ట‌….

- Advertisement -

ఏపీకి ప్రత్యేక హోదా కోసం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, బంద్ లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పట్లో వేలాది మందిపై కేసులు నమోదయ్యాయి. హోదా పోరాటంలో పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

ప్రజావేదికలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమావేశం సందర్భంగా ఈ కేసుల అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసులను ఎత్తివేయాలంటూ ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో కేసులను ఎదుర్కొంటున్న వేలాది మందికి ఊరట లభించనుంది.

అభివృద్ది చెందిన దేశాల్లో ప్రజలే పోలీసులను ఎంపిక చేసుకొంటారని ఆయన చెప్పారు.మనకు నచ్చినా నచ్చకపోయినా కూడ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిందేనని జగన్ పోలీసులకు తేల్చి చెప్పారు. తప్పు చేస్తే ఎవరినీ కూడ వదలొద్దని సీఎం కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -