Friday, March 29, 2024
- Advertisement -

గ్రామ వార్డు, సచివాలయ పరీక్షాల ఫలితాలను విడుదల చేసిన సీఎం జగన్…

- Advertisement -

జగన్ ప్రభుత్వం ప్రతీష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ,సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఫలితాలను విడుదల చేశారు, ఈ కార్యక్రమానికి మంత్రులు, ఉన్నతాధికారులు హజరయ్యారు. గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 1 నుంచి 8 వరకు నిర్వహించిన పరీక్షలకు 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

దాదాపు 1.26 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఈ నెల 1 నుంచి 8 వరకూ పరీక్షలను నిర్వహించింది. ఈ సందర్భంగా 19 రకాల ఉద్యోగాల భర్తీకి 14 పరీక్షలు చేపట్టింది.ఈ ఫలితాలను ప్రభుత్వ వెబ్ సైట్ http://gramasachivalayam.ap.gov.in/ లో చూసుకోవచ్చు. పరీక్షలు పూర్తిచేసిన 10 రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30, వచ్చే నెల 1న రెండ్రోజుల పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం గాంధీజయంతి(అక్టోబర్ 2) రోజున వీరంతా ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -