- Advertisement -
పాదయాత్రలో ఆశా వర్కర్లకు జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అధికారంలోకి రాగానె వారి జీతాలు భారీగా పెంచుతామని ఇచ్చిన నిర్ణయాన్ని అములు చేశారు. ఆశావర్కర్ల జీతాలను పదివేల రూపాయలకు పెంచుతున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖపై సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టిన వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకు ఆశా వర్కర్లకు నెలకు రూ.3 వేలు మాత్రమే ఇస్తుండగా, ఇకనుంచి నెలకు రూ.10 వేలు వేతనంగా అందుకోనున్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో తమ సమస్యలను పరిస్కరించాలని ఆశా వర్కర్లు అనేక సార్లు జగన్కు విన్నవించుకున్నారు. దానికనుగునంగా వారి జీతాలు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.