- Advertisement -
సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడిపందేల రాయుళ్లకు పండుగే. ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో రోజు కూడా కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. డబ్బు నీట ప్రవాహంలా పారుతోంది. వందల కోట్లు చేతులు మారుతన్నాయి. మకర సంక్రాంతి రోజున ఉదయం 10 గంటలకే పందేలు ప్రారంభమయ్యాయి. ఈ పందేలను చూసేందుకు ఏపీలోని ఇతర జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. మొదటి రోజు రూ.50 కోట్ల రూపాయలు చేతులు మారాయి.