తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తొలి ఓటమి ఎదురయింది. ఈ ఎన్నికల్లో జగిత్యాల మహాకూటమి అభ్యర్థి జీవన్ రెడ్డి టీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. టీఆర్ఎస్ నేత సంజయ్ చేతిలో 40,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
రెండు రోజుల కిందట జీవన్ రెడ్డికి లగడపాటి రాజగోపాల్ ఫోన్ చేసి, జగిత్యాల నుంచి విజయం సాధిస్తున్నట్టు చెప్పారు. అన్నా.. నువ్వు గెలుస్తున్నావ్. ప్రజాఫ్రంట్ అధికారంలోకి వస్తుంది. నీకు మంత్రి పదవి కూడా వస్తుందని జీవన్రెడ్డికి చెప్పారు. ఇదే విషయాన్ని జీవన్ రెడ్డి తన అనుచరులకు సైతం వెల్లడించారు. అనూహ్యంగా జీవన్రెడ్డి ఓటమి పాలయ్యారు. మరోవైపు నాగార్జున సాగర్ లోనూ కాంగ్రెస్ నేత జానారెడ్డిపై నోముల నర్సింహయ్య వెయ్యి ఓట్ల మెజారిటీతో సాగుతున్నారు.
లగడపాటి సర్వేలు కూడా తల్లకిందులయ్యాయి. మహాకూటమి అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన చెప్పగా, ప్రస్తుతం టీఆర్ఎస్ మూడింట రెండొంతుల మెజార్టీ సాధిస్తోంది. ఇక, చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు