బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్లో ఝాన్సీ బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది ఝాన్సీ. ఆమె మరణించి మూడు రోజలు కావస్తున్న ఇప్పటికి వరకు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సూర్య తేజ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతను తన సెల్ఫోన్ ఆఫ్ చేసుకుని ఎక్కడికో పారిపోయాడని అంటున్నారు పోలీసులు. దీంతో సూర్యతేజ వేధింపుల వల్లే ఝన్సీ ఆత్మహత్య చేసుకోని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
శనివారం ఝాన్సీ తల్లి అన్నపూర్ణతోపాటు పలువురు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు సూర్యను అదుపులోకి తీసుకోవాలని కోరారు. విచారణలో భాగంగా శనివారం సాయంత్రం మరోసారి ఝాన్సీ ఇంటికి వెళ్లారు పోలీసులు. ఝాన్సీ ఫ్లాట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఝాన్సీ రూమ్, ఆత్మహత్య చేసుకున్న స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసుల సోదాల్లో ఝాన్సీ రాసుకున్న డైరీ లభ్యమైంది. ఆ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాదు ఝాన్సీకి సంబంధించి సూసైడ్ నోట్ రాసిందా అన్న కోణంలో కుటుంబ సభ్యులను విచారించారు. అయితే సూర్య తేజ వేధింపుల వల్లే ఝన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తెలిందని సమాచారం. ఝాన్సీ డైరీలో కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఏ విషయాన్ని పోలీసులు బయటికి చెప్పడం లేదు. అటు నిందితుడిగా భావిస్తోన్న సూర్య తేజ మరో రెండు రోజుల్లో తన దగ్గర ఉన్న సాక్ష్యలతో పోలీసుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.