Wednesday, April 24, 2024
- Advertisement -

విమానంలో కరోనా వ్యక్తి… దూకేసిన ఫైలెట్..!

- Advertisement -

కరోనా పేరు వింటనే జనం వణికిపోతున్నారు. చైనాలోని వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 16 వేల మందికి పైగా మృతి చెందారు. అలానే 3.5 లక్షల మంది కరోనా భారిన పడ్డారు. దాంతో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా కరోనా వైరస్ వ్యాధి అనుమానిత రోగి విమానంలో ప్రయాణిస్తున్నాడని సమాచారం అందిన వెంటనే ఆ విమానం పైలెట్ ఆందోళకు గురై – కాక్ పిట్ లో నుంచి దూకేశాడు.

ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఈ నెల 20వ తేదీన పూణే నుంచి ఢిల్లీకి 15-732 ఎయిర్ ఏసియా విమానం ప్రయాణించింది. ఈ ఎయిర్ ఏసియా ఫ్లైట్ లో ప్యాసింజర్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఈ విమానం ప్రయాణించినప్పటికే భారత్ లో కరోనా వైరస్ వ్యాధుల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది. ఆ విమానంలో కరోనా వైరస్ వ్యాధి అనుమానిత రోగి ప్రయాణిస్తున్నాడని తన ముందు సీటులోనే ఆ రోగి కుర్చున్నాడని ఆ విమానం పైలెట్ కు తెలిసింది.

అంతే అప్పటి నుంచి విమానం పైలెట్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానం ను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వరకు తీసుకువచ్చాడు. అయితే విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు.. విమానాన్ని ఎయిర్ పోర్ట్ లోని మారుమూల ప్రాంతంలో నిలపాలని ఫైలెట్ కు సూచించారు. అధికారులు సూచించినట్లుగా విమానం ల్యాండ్ అయిన తరువాత ఎయిర్ పోర్టు మారుమూల ప్రాంతానికి విమానంని తీసుకెళ్లారు. విమానంలోని కరోనా వైరస్ అనుమానిత ప్రయాణికుడికి వైద్యపరీక్షలు నిర్వహించడంతో నెగిటివ్ అనే తేలింది.

అనంతరం విమాన ప్రయాణికులు – సిబ్బందిని ముందు ద్వారం నుంచి కాకుండా వెనుక ద్వారం నుంచి కిందకు దించారు. ఆ సమయంలో పైలెట్ విమానం దిగకుండా చాలా సేపు క్యాబిన్ లో సెల్ఫ్ క్వారెంటైన్ విధించుకున్నాడు. తరువాత ఒక్కసారిగా విమానంలోని కాక్ పిట్ లోని కిటికీలో నుంచి కిందకు దూకేసిన పైలెట్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు పరుగు తీశాడు. మొత్తం మీద ఎక్కడ కరోనా వైరస్ వ్యాధి సోకుతుందో అనే భయంతో పైలెట్ ఆందోళన చెంది కాక్ పిట్ నుంచి కిందకు దూకేశాడని ఆలస్యంగా విషయం వెలుగు చూడటంతో అది కాస్త వైరల్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -