ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చేందుతోంది. రోజురోజుకి ఈ కరోనా కేసుల సంఖ్య పేరుగుతూనే ఉంది. ఏ నిమిషయం ఎవరి ప్రాణాలు పోతాయో అన్న భయం జనాల్లో పట్టుకుంది. ఇప్పటికే ఈ కరోనా 200 దేశాలకు వ్యాప్తి చెందింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7.60 లక్షలకు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 36,862 మంది మృతి చెందారు.
అత్యధికంగా ఐరోపా ఖండంలో 27 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మరణాలు అత్యధికంగా నమోదవుతున్న ఇటలీలో 24 గంటల్లో మరో 812 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్లో 537 మంది మృతి చెందారు. ఇక అమెరికాలో ఒక్క రోజులో దాదాపుగా 20,000 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆ దేశంలో 568 మంది చనిపోయారు.
దీంతో ఆ దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 3,148కి చేరింది. ప్రాన్స్లోనూ ఒక్క రోజులో 418 మంది మృతి చెందగా, బ్రిటన్లో 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అందుకే ఎవరు బయటకు రావొద్దని.. ఎప్పటికి అప్పుడు చేతులు కడుకోవ్వాలని ప్రభుత్వాలు హెచ్చారిస్తున్నాయి.