Thursday, April 18, 2024
- Advertisement -

వివాహేత‌ర సంబంధానికి అంగీక‌రించ‌లేద‌ని ఆత్మహ‌త్య చేసుకున్న జంట‌

- Advertisement -

కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను చూస్తుంటే స‌మాజం ఎటువైపు ప‌య‌నిస్తుందో అర్థం కావ‌డం లేదు. నేటి స‌మాజంలో వివాహేత‌ర సంబంధాలు ఎక్కువైయ్యాయ‌ని జ‌గ‌మెరిగిన స‌త్యం. చూసే చూపు, మాట్లాడే మాట ఇలా అన్నింటిల్లో ద్వంద వైఖ‌రి అవ‌లంభిస్తున్నారు. ఈ విష‌యంలో మ‌గ‌వారితో స‌మానంగా ఆడ‌వారు కూడా పోటీ ప‌డుతుండటం విశేషం. ఇక విష‌యంలోకి వెళ్తే..పెళ్లైన ఓ వివాహేత‌ర సంబంధం గురించి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. గోపీనాథ్(31) , రాజేశ్వరి(33) ఇద్ద‌రికి వేరుగా వివాహాలు అయ్యాయి.

అయితే అనుకొని కార‌ణల‌తో వీరిద్ద‌రి మ‌ధ్య అక్ర‌మ సంబంధం మొద‌లైంది. దాని వ‌ల్ల ఇరు కుటుంబాల్లో త‌రుచు గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. పంచాయితీ పెట్టిమ‌రి ఇక మీద వీరు క‌ల‌వ‌డానికి వీల్లేద‌ని కండిష‌న్ విధించారు. అయితే వీరు ఒక‌రిని విడిచి మ‌రోక‌రు ఉండ‌లేక తమిళనాడు ,విల్లుపురం జిల్లా త్యాగదురుగమ్‌లోని ఓ లాడ్జీలో దిగారు. అక్క‌డే త‌మ వెంట‌తెచ్చుకున్న ప‌రుగుల మందుతాగి ఇద్ద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

లాడ్జీ యాజ‌మాన్యం మొద‌ట వీరు భార్య‌, భ‌ర్త‌ల‌ని భావించారు. తీరా అస‌లు విష‌యం తెలుసుకున్న లాడ్జీ యాజ‌మాన్యం కంగుతిన్నారు. ఇరు కుటుంబీకులు వీరి ప్రేమకి వ్యతిరేకించడంతో ఇద్దరూ ఇంటి నుంచి బయటకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -