Friday, April 26, 2024
- Advertisement -

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం..

- Advertisement -

నాలుగేళ్ల చిన్నారి జీవితాన్ని చిదిమేశాడు ఓ కామాంధుడు. ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘట ముంబయ్ లో చోటు చేసుకుంది.ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాకు చెందిన అశోక్‌కుమార్ యాదవ్(24) అనే యువకుడు ఉపాధి నిమిత్తం కొద్ది నెలల క్రితం నవీ ముంబయికి వలస వచ్చాడు. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు.

అతడి ఇంటి పక్కనే ఓ దంపతులు నివాసముంటున్నారు. వారి నాలుగేళ్ల కుమార్తె గత ఆదివారం ఆడుకోవడానికై బయటకు వెళ్లింది.అక్కడే ఉన్న అశోక్‌ కుమార్‌ యాదవ్‌(24) అనే దినసరి కూలి ఆ చిన్నారిపై కన్నేశాడు. మాయ మాటలు చెప్పి ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడాడ్డడు.

బాలిక కోసం వెతుకుతుండగా ఓ చోట బాలిక ఏడుస్తూ కనిపించడంతో ఏం జరిగిందని అడిగారు. ఆమె జననాంగాల నుంచి రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.బాలికను పరీక్షించిన డాక్టర్లు అత్యాచారం జరిగిందని చెప్పడంతో అంతా షాకయ్యారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అశోక్‌పై ఐపీపీ 376(అత్యాచారం) సెక్షన్‌తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితున్ని మంగళవారం అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -