Friday, April 19, 2024
- Advertisement -

మరో సారి ఆడపిల్ల పుట్టిందని ఘోరానికి ఒడిగట్టిన తాత…

- Advertisement -

అన్ని రంగాల్లో మహిళలు దూసుకెల్తున్నా వారినై ఇంకా వివక్ష కొన సాగుతోంది. ఆడ పిల్లలు అని తెలిస్తే చాలు తల్లి కడుపులోనే చిదిమేస్తున్న వారు కొందరైతే.. పసికందులు లోకాన్ని చూసీ చూడకండానే పురిట్లోనే ప్రణాలు తీస్తున్నారు. బయటి వారి కంటెసొంతత బంధువులే ఆడపిల్ల పాలిట యముడిలా మారుతున్నారు. మానవత్వానికి మచ్చ తెచ్చే.. కర్కశత్వానికి నిదర్శనంగా నిలిచే దారుణ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని, అత్యంత దారుణంగా గొంతులో వడ్లగింజలు వేసి పుట్టిన వారం రోజులలోపే గుట్టు చప్పుడు కాకుండా చంపేశాడో తాత. అయితే బాలల సంరక్షణ అధికారులు జోక్యం చేసుకోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కేశవపురం శివారు ఎరగట్టు తండాకు చెందిన భూక్యా మమత, తిరుపతి దంపతులకు ఈ నెల 4న పండంటి ఆడబిడ్డ జన్మించింది. అంతకు ముందే దంపతులకు ఆడపిల్ల ఉంది.దీంతో సెప్టెంబర్ 5న తల్లీబిడ్డలను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. రెండో సారి కూడా ఆడ పిల్ల పుట్టిందనె కోపంతో ఆ చిన్నారి తాత మానవత్వాన్ని మరిచిపోయి నోటిలో వడ్లగింజలు వేసి చంపేశాడు.అనంతరం తన ఇంటి పక్కనె పసిపాపను ఖననం చేశారు.దీంతో స్థానికులకు అనుమానం వచ్చి చైల్డ్ లైన్ కేంద్రానికి సమాచారం ఇచ్చారు.

దీంతో వరంగల్ రూరల్ జిల్లా సంరక్షణ అధికారి మహేందర్ రెడ్డి సోమవారం తండాకు వచ్చి, ఘటనపై విచారణ చేపట్టారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయిందని అధికారులకు తెలిపారు. ఆరోగ్యంతో జన్మించిన పాప అకస్మాత్తుగా ఎలా మరణించిందని ఆరా తీశారు.వారికి అందిన సమాచారం మేరకు ఆ చిన్నారి తాత.. బిడ్డ గొంతులో వడ్లగింజలు వేసి, హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -