Friday, April 19, 2024
- Advertisement -

నమ్మించి కూతురి గొంతు కోసిన తల్లి,దండ్రులు…

- Advertisement -

కులాంతర వివాహాలు వారి కుటుంబాల్లో తవ్ర విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. తల్లి,దండ్రులకు ఇస్టం లేని పెళ్లిల్లు చేసుకుంటుండంతో పరువు కోసం కన్న బిడ్డలు అని చూడకుండా తల్లి, దండ్రులు కిరాతకంగా హతమారుస్తున్న సంఘటనలు జరగుతూనె ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటన హర్యానాలోని సోనీపత్‌ సమీపంలో శనివారం చోటుచేసుకుంది .

వివరాల్లోకి వెల్తే…సోనీపత్‌కు దగ్గరలోని గోహన గ్రామానికి చెందిన రీతు అనే యువతి కుటుంబసభ్యుల అభిష్టానికి వ్యతిరేకంగా రెండు నెలల క్రితం అర్జున్‌ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. తన సోదరి అంజలితో తరుచు మాట్లాడుతూ ఉండేది. ఆరోగ్యం బాగోలేదని రీతు తన సోదరి అంజిలికి తెలిపింది. దీంతో రీతును సోనీపత్‌లోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవటానికి రావాలని కోరింది అంజలి. రీతు భర్త అర్జున్‌తో కలిసి ఆసుపత్రికి వచ్చింది. అక్కడికి అంజలితో పాటు రీతు తల్లి, సోదరుడు కూడా వచ్చారు.

సరదాగా మాట్లాడుతూ ఇంట్లో ఉన్న సభ్యులను కూడా కలుసుకోవాలని రీతు తల్లి, సోదరి బ్రతిమాలడంతో రీతూ కాదనలేకపోయింది. రీతు తన భర్త అర్జున్ తో కలసి ఇంటికి వెల్లింది. అయితే అర్జున్ ఇంట్లోకి రానని బయటే ఉండిపోయారు.ఇంట్లోకి వెళ్లిన రీతును ఆమె కుటుంబసభ్యులు దారుణంగా తల నరికి హత్య చేశారు. తదనంతరం అర్జున్‌ను కూడా వెంటపడి చంపటానికి ప్రయత్నించారు. వారి దాడినుంచి తప్పించుకున్న అర్జున్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మొత్తం ఆరు మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న హతురాలి కుటుంబసభ్యుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -