వరకట్న వేధింపులకు నవ వధువు తనువు చాలించింది. అదనపు కటన్నం తేవాలని భర్త, అత్త,మామలు వేధింపులు తాలలేక బాత్ రూమ్ లో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని ఆర్ఎల్నగర్ సమీపంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెల్తే…ప్రకాశం జిల్లాకు చెందిన నర్సింహ్మ, అంజమ్మ దంపతులు హైదరాబాద్లోని ఈసీఐఎల్లో నివాసం ఉంటున్నారు. వీరి కూతురు శ్రావణి (20)ని కీసర మండలం ఆర్ఎల్ నగర్లో ఉంటున్న రామాంజనేయులుకు ఇచ్చి 5 నెలల క్రితం వివాహం జరిపించారు.
ఫెళ్లి సమయంలో బంగారు ఆభరణాలను రూ.5 లక్షల మేర కట్నం వరుడి కుటుంబానికి అప్పగించారు. వివాహం జరిగిన కొన్ని రోజులనుండే అదనపు కట్నం కోసం భర్త ఆంజనేయులు, అత్త రేణుకమ్మ, మామవెంకట్రావు,మరిది, ఆడ పడచు, , తరచూ శ్రావణిని వేదిస్తుండేవారు. ఈ విషయం తల్లి,దండ్రులకు చెప్పడంతో మరో 5 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు.
గురువారం ఉద యం శ్రావణి,రామంజనేయులు ఇద్దరిమధ్య మరో సారి గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రావణి సాయంత్రం బాత్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మెడపైనల్లగా కమిలిన గాయాలు ఉండటంతో అనుమానం వచ్చి కీసర పోలీసులకు సమాచారం అందించారు. కీసర సీఐ నరేందర్గౌడ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధి ఆసుపత్రికి తరలించారు.