ప్రతీ చేతిలో ఫోన్.. కుదిరితే ఫోన్లో కబుర్లలో మునిగిపోవడం.. ఇంకా వీలైతే సోషల్ మీడియా యాప్లో మునిగితేలడం కామన్ అయ్యింది. అలా చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా సంఘటనే చోటు చేసుుంది.తన భర్తతో ఫోన్లో మాటల్లో పడిపోయి.. తన పక్కన ఏం జరుగుతుందో కూడా చూసుకోకపోవడంతో ఓ మహిళ ప్రాణాలు పోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
వివరాల్లోకి వెల్తే…ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లోని రియాన్వ్ గ్రామంలో జై సింగ్ యాదవ్, గీత దంపతులు నివసిస్తున్నారు.జైసింగ్ యాదవ్ థాయిలాండ్లో పని చేస్తున్నాడు. గీత స్వగ్రామంలోనే ఉంటుంది. బుధవారం రోజు తన భర్తకు ఫోన్ల్లో మాట్లాడుతూ.. ఇంట్లోకి వచ్చిన గీత.. బెడ్పై కూర్చింది. మాటల్లో పడి అప్పటికే బెడ్పై ఉన్న రెండు పాములను ఆమె గుర్తించలేదు. వెంటనే పాముల మీద కూర్చోవడంతో ఆమెని కాటు వేశాయి.
దీన్ని గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మరోవైపు, ఆ రెండు పాములను కుటుంబసభ్యులు, చుట్టుపక్కలవారు చంపేశారు.