Friday, March 29, 2024
- Advertisement -

ప్రేమికుడితో ఇద్దరమ్మాయిల పరార్….

- Advertisement -

అమ్యాయిలు, అబ్బాయిలు ప్రేమించుకోవడం ..పెద్దలు ఒప్పుకోక పోతె ఇంట్లోనుంచి పారిపోయి పెళ్లిల్లు చేసుకోని బ్రతకడం సాధారణం అయ్యింది. అయితే ఇప్పుడు వింటున్నది వెరైటీ లవ్ స్టోరీ. ఇద్దరు అమ్మాయులు ఓయువకుడితో పారిపోవడం కలకలం రేపుతోంది.ఈసంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటు చేసుకుంది.

పలమనేరు మండలంలోని పందేరు ఒడ్డూరు గ్రామానికి చెందిన రాజశేఖర్(20) అనే యువకుడితో ఇద్దరు అమ్మాయిలు చనువుగా ఉండేవారు.కొన్నిసార్లు హద్దులు దాటినట్లు కనిపించడంతో అతడి తల్లి నాగమ్మ కొడుకును హెచ్చరించేది.ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీ నుంచి రాజశేఖర్ కనిపించకుడా పోయాడు. ఇంట్లోని రూ.12వేల నగదు తీసుకుని బైక్‌తో సభా ఎక్కడికో వెళ్లిపోయాడు.

కుటుంబీకులు చుట్టుపక్కల గ్రామాల్లో, బంధుమిత్రుల ఇళ్లలో గాలించినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఇదే సమయంలో రాజశేఖర్ తో పరిచయం పెంచుకున్న ఇద్దరు యువతులు కూడా కనిపించకుండా పోయారు.తన కుమారుడ కనిపించడం లేదంటూ యువకుడి తల్లి నాగమ్మ పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజశేఖర్ ఆ అమ్మాయిలతొ ప్రేమ వ్యవహారం కారణంగా వెళ్లిపోయాడా? లేక వేరే కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారిస్తున్నారు. ఈ వెరైటీ లవ్‌స్టోరీ స్థానికంగా చర్చనీయాంశమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -