- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన 9నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో వరంగల్ కోర్టు నిందితుడికి మరణ శిక్షను విధించింది. ఈ కేసులో ప్రవీణ్ నేరం చేసినట్టు కోర్టు నిర్ధారించింది. జూన్ 18న అర్ధరాత్రి సమయంలో చిన్నారిపై ప్రవీణ్ ఘాతుకానికి పాల్పడిన విషయం విదితమే. ఘటన జరిగిన 50 రోజుల్లోనే కేసు దర్యాప్తు చేసి శిక్షను ఖరారు చేసింది. మొదటి అదనపు జడ్జ్ జయకుమార్ ముందు ప్రవీణ్ నేరం అంగీకరించడంతో అతనికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో అత్యంత కిరాతకంగా వ్యవహరించిన ప్రవీణ్ తరఫున ఎవరు వాదించరాదని వరంగల్ బార్ అసోసియేషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే .