Friday, April 19, 2024
- Advertisement -

ఇద్ద‌ర‌మ‌ని చెప్పి సెక్స్ వ‌ర్క‌ర్ల‌పై 9 మంది గ్యాంగ్ రేప్‌….

- Advertisement -

దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం పడుపు వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ముగ్గురి వేశ్ల‌ల‌పై దారుణంగా వ్య‌వ‌హ‌రించారు కొద‌రు. ఇద్ద‌ర‌ని చెప్పి 9 మంది వారిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న నోయిడాలో చోటుచేసుకుంది. బాధితురాల్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వివ‌రాల్లో కి వెల్తే….లజ్‌ పత్‌ నగర్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ విటుడి కోసం సెక్స్ వర్కర్లు వేచి చూస్తున్న వేళ, స్విప్ట్‌ డిజైర్‌ కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తమకు వేశ్యలు కావాలని, ఒక రాత్రి గడిపితే రూ. 3 వేల చొప్పున ఇస్తామని, తాము ఇద్దరం ఉన్నామని చెప్పారు. అందుకు వేశ్యలు అంగీకరించగా, అడ్వాన్స్ కింద, రూ. 3600 ఇచ్చారు.అనంతరం నొయిడా సెక్టార్‌ 135లోని ఓ ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు.

అప్ప‌టికే అక్క‌డ 7గురు ఉండ‌టంతో అస‌లు విష‌యాన్ని గ్ర‌హించిన సెక్స్ వర్కర్లు, తాము తిరిగి వెళ్లిపోతామని చెప్పారు. వారిని వెళ్లనివ్వకుండా, బెదిరించి, వారిని కొట్టి, బలవంతంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారికి అడ్వాన్స్‌గా ఇచ్చిన సొమ్మును కూడా లాక్కున్నారు.

అనంతరం అందులోని ఒక వ్యక్తిని బతిమాలితే.. బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మెయిన్‌ రోడ్డుపై వదిలిపెట్టాడు. వెంటనే 100కు డయల్‌ చేసి జరిగిందంతా చెప్పాం.వారు మాకిచ్చిన అడ్వాన్స్‌ కూడా బలవంతంగా లాక్కున్నారు.’ అని బాధితురాల్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప‌లు సెక్స‌న్ల కింద కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు 7 మందిని అదుపులోకి తీసుకున్నారు.నిందితులంతా ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ అని, ఒకరు మాత్రం క్యాబ్‌ డ్రైవర్‌ గా పని చేస్తున్నాడని, పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -