- Advertisement -
బ్యాంకులకు వేలకోట్లు కుచ్చుటోపి పెట్టిన లిక్కర్ దొంగ విజయ్ మాల్యాకు ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. ఫెరా నిబంధనల ఉల్లంఘనల కేసులో బెంగుళూరులోని మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఫెరా చట్టం కింద దాఖలైన కేసులో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
జూలై 10లోగా మాల్యా ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. మరికొంత గడువు కావాలని న్యాయవాది కోరినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ తాజా ఆదేశాలు ఇచ్చారు.జూలై 10 కల్లా ఆస్తులను అటాచ్ చేయాల్సిందిగా కోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. అదే రోజు ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది.