Saturday, April 20, 2024
- Advertisement -

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం…..జైట్లీ పరిస్థితిపై ఆందోళన

- Advertisement -

ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ​​​​​​మొదటి అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డు సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం సంభవించడంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. 22 ఫైరింజన్లను అక్కడికి తరలించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఎయిమ్స్ లో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కూడా అత్యవసర చికిత్స పొందుతుండడంతో ఆందోళన నెలకొంది. అయితే ఆయనకు ఎయిమ్స్ ప్రాంగణంలోని మరో భవనంలో చికిత్స నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -