ఆయన ఒక బాధ్యత కలిగిన పోలీసు ఆఫీసర్. ప్రజలకు మంచి చేయాల్సిన వృత్తిలో ఉంటూ వివాహితకు మాయమాటలు చెప్పాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. చివరకు ఆమె భర్తకు అడ్డంగా దొరికిపోయారు. చిత్తూరు జిల్లా తిరుచానూరులో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెల్తే…పగడాల నాగ దుర్గప్రసాద్ మంగళగిరి తొమ్మిదో బెటాలియన్లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ నిజాంపేటలో ఉన్న సమయంలో ప్రసాద్ రెడ్డి-ధనలక్ష్మి దంపతులతో డీఎస్పీకి పరిచయం ఏర్పడింది. ప్రసాద్ రెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా కలికిరి. ఐతే ప్రసాద్కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన డీఎస్పీ ..తెర వెనక ఆయన భార్యతో వివాహేతర సంబంధం నడిపారు.
టీటీడీలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని…తిరుపతి రావాల్సిందిగా అతడికి డీఎస్పీ చెప్పాడు. ఉన్నతాధికారి కావడంతో అతని మాటలు నమ్మిన దంపతులు హైదరాబాద్ నుంచి తన నివాసాన్ని తిరుచానూరుకు మార్చారు.ఇదే క్రమంలో అతని భార్యతో డీఎస్పీ సన్నిహితంగా మెలుగుతూ లోబరచుకున్నాడు. ఆరు నెలలు ఎదురుచూసినా ఉద్యోగం రాకపోవడంతో అతను హైదరాబాద్ చేరుకుని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ పది రోజులకోసారి తిరుపతికి వచ్చేవాడు.
డీఎస్పీతో చనువుగా ఉంటున్న విషయం తెలిసి ప్రసాద్ రెడ్డి పలుమార్లు భార్యను హెచ్చరించాడు. ఐనా ఆమె ప్రవర్తలో మార్పు లేకపోగా..భర్తను దూరంపెట్టింది. తనను వేధిస్తున్నాడని పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. భార్య వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రసాద్ రెడ్డి కొంతకాలంగా సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం వైష్టవి అపార్ట్మెంట్లో తన భార్యతో డీఎస్పీ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మీడియాతో పాటు పోలీసులను చూసిన డీఎస్పీ అక్కడి నుంచి పరుగులు తీసి పారిపోయాడు. భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ రాసలీలల విషయాన్ని మంగళగిరి బెటాలియన్కు సమాచారం అందించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో డీఎస్పీ నాగదర్గాప్రసాద్ వ్యవహారం హాట్టాపిక్గా మారింది.