- Advertisement -
అగ్రవర్ణ పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్ల అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీకం కోర్టు నిరాకరించింది. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ రంజన్ గొగొయ్, జస్టిస్ సంజీవ్ కన్నాలతో కూడిన సుప్రీం బెంచ్ ఇలా స్పందించింది. ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై స్టే విధించడానికి నిరాకరించిన ధర్మాసనం…కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నాలుగు వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది సుప్రీంకోర్టు.