ఇటీవలే టీడీపీలోకి రావాల్సిందిగా చంద్రబాబు నుంచి ఆహ్వానం కూడా అందుకుని అందరి దృష్టిని ఆకర్శించిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబును ఉద్యోగులు చుట్టుముట్టి కొట్టారు. చొక్కా చించి ఈడ్చిపడేశారు. దాడిలో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి.
అశోక్బాబు మద్దతుదారుడు ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డిని కూడా ఉద్యోగులు తీవ్ర స్థాయిలో కొట్టారు. గచ్చిబౌలిహౌసింగ్ సొసైటీలిమిటెడ్ వ్యవహారంలో ఈ దాడి జరిగింది. స్థలాల కోసం ఉద్యోగులంతా దాదాపు 34 కోట్ల రూపాయలు చెల్లించారు. కానీ ఇప్పటి వరకు స్థలాలు రాలేదు. దీంతో తమ డబ్బుల సంగతి తేల్చాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అశోక్బాబు నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
‘మేం కట్టిన డబ్బులు ఎక్కడ? స్థలాల కేటాయింపు విషయాన్ని ఏళ్లు గడుస్తున్నా తేల్చడం లేదు. సొసైటీ జనరల్ బాడీ సమావేశాలు ఎందుకు పెట్టడం లేదు? కోట్ల రూపాయలు మెక్కారు’ అంటూ అశోక్బాబుపై ఉద్యోగులు తిరగబడ్డారు. ఒక్కసారిగా అశోక్బాబు, చంద్రశేఖర్ రెడ్డిని చొక్కాలు చించికొట్టారు. అక్కడే ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు. ఉద్యోగులు ఇలా తిరగబడడంతో కొందరు ఉద్యోగుల సాయంతో అశోక్బాబు అక్కడి నుంచి తప్పుకున్నారు. ఈ గొడవపై ఇరువర్గాలు పరస్పరం పోలీస్ స్టేషన్లోఫిర్యాదులు చేసుకున్నారు.